తండ్రిని- బాబాయ్ని కలిపే పనిలో చెర్రీ...!!
రామ్చరణ్ మరో స్కెచ్ వేశాడు. విడిపోయిన నాన్న- బాబాయ్లను కలిపే పనిలోపడ్డాడు. నమ్మడానికి విచిత్రంగావున్నా ముమ్మాటికీ నిజమేనంటున్నారు ఫిల్మ్నగర్ వాసులు. ఇదంతా రియల్లైఫ్లో మాత్రం కాదండోయ్... రీల్ లైఫ్లో మాత్రమే! చెర్రీ లేటెస్ట్ మూవీ ‘గోవిందుడు అందరివాడేలే’.కృష్ణవంశీ డైరెక్షన్లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని స్టోరీ ప్రకారం విడిపోయిన తండ్రిని-బాబాయ్ని కలిపే బాధ్యతను ఈ హీరో తీసుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.
ఇందుకోసమే సిటీ నుంచి పల్లెటూరు కొస్తాడని అంటున్నారు. సమాజం బాగుండాలంటే కుటుంబాలు కావాలి... అందులోనూ బంధాలు బలంగా వుండాలి. ఈ నేపథ్యంలో తన కుటుంబంలో ఆనంద దీపాల్ని వెలిగించడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నమే ‘గోవిందుడు అందరివాడేలే’ మెయిన్ స్టోరీని నిర్మాత ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. చరణ్ సరసన కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, రాజ్కిరణ్, కామ్నా జెఠ్మలానీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
No comments:
Post a Comment